సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ పెద్దలు.... అంతర్గత కుమ్ములాటలు వీడి ప్రజా సమస్యలపై పోరాడాలని పుట్టపర్తి నియోజకవర్గం టీడీపీ అధికార ప్రతినిధి మారుతీరెడ్డి, ITDP అధికార ప్రతినిధి కిలారి శ్రీనాథ్ కోరారు. టీడీపీ నాయకుల కొట్లాట్లతో కార్యకర్తలు అయోమయంలో ఉండిపోవలసి వస్తోందని ఆవేదన చెందారు..... పుట్టపర్తిలోని టీడీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వీరు....నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి పార్టీ పెద్దల్లో అంతర్గత కుమ్ములాటలు అధికమయ్యాయని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేయాలని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన శాయశక్తులా కృషి చేస్తుంటే..... పుట్టపర్తి నియోజకవర్గంలో టికెట్ కోసం గొడవలకు దిగటం పార్టీలో అలజడి రేపుతోందని అన్నారు. టికెట్ ఎవరికి ఇచ్చినా గెలవాలని కోరుకోవాలే కానీ కొట్లాటలకు దిగడం బాధకలిగిస్తోందన్నారు. కావున పార్టీ పెద్దలు గమనించి టికెట్ కోసం కాకుండా ప్రజా సమస్యలకోసం పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు తెలుగుయువత అధ్యక్షుడు కిషోర్, టీడీపీ నాయకులు బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, రమణ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin