సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి గడువు అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారులు తమతమ దరఖాస్తులను దరఖాస్తు ఫామ్ మీద ఫిలప్ చేసి, మీ దగ్గర ఉన్న ఆధార్, రేషన్ కార్డ్, ఇతర ఏ ఆధారాలు ఉంటే అవి జతపరిచి దరఖాస్తు చేసుకుంటే చాలు. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతీ నియోజకవర్గానికి ప్రస్తుతం మొదటి దశలో 3వేల ఇండ్లు పూర్తి అయిన తర్వాత రెండో దశలో ఇచ్చే గృహలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు. దశల వారీగా అర్హులైన పేదల ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి అమలు చేస్తామని అన్నారు . అసత్య ప్రచారాలు నమ్మొద్దని, పేదలు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరుతున్నాం. మీ దగ్గర ఉన్న ఆధారాలతో దరఖాస్తు చేసుకోండి, అధికారులు దరఖాస్తులను పరిశీలించేటప్పుడు అన్ని వివరాలు తీసుకుంటారని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
-----------------------
Admin