సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం పట్టణములో మేదర్ బస్తిలో ఏర్పాటు చేసిన దుర్గామాత మంటపాలను గురువారం మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ శంకర్ నాయక్ సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అన్నదానం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ కనకదుర్గమ్మను నమ్ముకున్న వారికి విజయాలు ఎల్లప్పుడూ కలగాలని ఆకాంక్షించారు అమ్మవారి ఆశీస్సులు దీవెనలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు నవరాత్రులు ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన కమిటీ నిర్వాహకులను డాక్టర్ శంకర్ నాయక్ అభినందించారు తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనకు రోజులు దగ్గరపడ్డాయని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు
-----------------------
Admin