Thursday, 30 July 2026 09:40:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కెసిఆర్ ని పడకొడతాం... ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ ను నిలబెడతాం...

Date : 10 May 2023 12:29 AM Views : 459

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ కోసం ఉదృతంగా పోరాటం జగురుతున్న తరుణంలో బీఎస్పీ జాతీయ పార్టీగా మద్దతు తెలిపిందని,పార్లమెంటులో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపిన మొట్టమొదటి పార్టీ బీఎస్పీ అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ గుర్తు చేశారు.మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ భరోసా మహాసభతో మే ఏడో తేదీన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు,బెహన్ మాయావతి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారన్నారు.మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించడం ద్వారా యావత్ తెలంగాణలోని బీఎస్పీ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని నింపినట్లు అయిందన్నారు.మాయావతి సూచనలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణలో బీఎస్పీ జెండాను ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు.ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా సన్నద్ధమవ్వాలని అన్నారు.రానున్న ఆరు నెలల కాలం ఎంతో విలువైందని చెప్పారు.ధన బలం,మద్యం ఆసరాగా చేసుకొని ఎన్నికల్లో గెలవాలనుకునే వారికి చైతన్యవంతులైన బీఎస్పీ ఓటర్లు సరైన సమాధానం చెప్తారని అన్నారు.ఒక్క బీఎస్పీ మాత్రమే బీసీలకు 60 శాతం నుంచి 70 శాతం వరకు టికెట్లు ఇవ్వడంతో పాటు వారిని కూడా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు.ఇందుకుగాను ఇప్పటినుంచే ఒక ప్రణాళిక బద్ధంగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు.ఏది ఏమైనప్పటికీ ఈసారి ముఖ్యమంత్రిగా ప్రవీణ్ కుమార్ ను గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు.అదేవిధంగా కేసీఆర్ ను కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని జోష్యం చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున రావు,సాయి,మాలోత్ వీరు నాయక్,తాటిపాముల హరిక్రిష్ణ,రంజిత్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: