సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సెప్టెంబర్ 17 ను బ్లాక్ డే గా ప్రకటించండి పిలుపు -ఆజాద్ విముక్తి జాతీయ సమైక్యత దినాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 17వ తేదీని బ్లాక్ డేగా ప్రకటించాలని సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అల్లూరి సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్, పత్రికకు పంపిన లేఖలో పేర్కొన్నారు. బిజెపి - టిఆర్ఎస్ ప్రకటించారని, ఈ ఎత్తుగడలు చరిత్రను వక్రీకరించడమే కాదు, తెలంగాణ ప్రజల తెగువను. బలి దనాలను అవమానించడం కేంద్రంలో రాష్ట్రంలో దోపిడి ప్రభుత్వాలను ప్రతిష్టం చేసుకునేందుకు ఉద్దేశించినవని ఇవి ఆధునిక నైజం పాలనకు నిదర్శనాలని ఆరోపించారు. శతాబ్ద కాలంగా దోపిడికి వ్యతిరేకంగా రైతంగం ఇతర పీడిత ప్రజల చేసిన తిరుగుబాటు చారిత్రత్మాక తెలంగాణ సాయుధ పోరాటం, భూసామ్యానికి, రాసరికనికి వ్యతిరేకంగా సాగిన పోరాటమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్రంలో నడుస్తున్న ఆధునిక నైజం పాలనకు ఇస్తున్న వ్యతిరేకథనా నుండి యువతను మళ్ళించడానికి నేటి బిజెపి- టిఆర్ఎస్ సెప్టెంబర్ 17న విముక్తి జాతీయ సమైక్యత దినంగా జరుపుకుంటున్నాయని చరిత్రను ఈ రకంగా వ్యతిరేకించడాన్ని ప్రతిఘటించాల్సిందిగా డివిజన్ కమిటీ, ప్రజాస్వామిక, విప్లవ, ప్రగతిశీల, యువ శక్తులకు ప్రజలకు అందరికీ పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు, ఈ రకంగా మనం మన చరిత్రను పోరాటాన్ని త్యాగాలను ఉనికిని కాపాడుకోగలుగుతామని, బానిస సంకెలను తెంచడానికి తమ ప్రాణాలను అర్పించిన సోహబ్ ఉల్లేహ ఖాన్, మౌల్విల్లీ ఖాన్, తుర్రే బాడీ ఖాన్, దొడ్డి కొమురయ్య, బాదంగి, ఐలామ్మ లను చరిత్ర ఎన్నడూ మరిచి పోదని తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ చరిత్రలో బ్లాక్ డే గా ప్రకటించాల్సిందిగా డివిజన్ కమిటీ పిలుపునిస్తుందని పత్రికలకు విడుదల చేసిన లేఖలో పేర్కొని ఉంది.
-----------------------
Admin