సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాముల రామిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పచ్చిపాల ఉపేందర్ (చంటి) సీతారాం నగర్ మదీనా మస్జీద్ లో గల అనాధ పిల్లలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్,పండ్లు పంపిణీ చేశారు ఇందిరా చౌక్ నందు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని తెలియజేశారు అనంతరం చంటి మాట్లాడుతూ సాముల రామిరెడ్డి న్యాయవృత్తిలో కొనసాగుతూ ఎంతో మంది పేదలకు సహాయం చేస్తూ న్యాయవాదులకు అండగా ఉంటూ నియోజకవర్గంలో జిల్లా కోర్టు కొరకు తీవ్ర కృషిచేసి న్యాయవాదుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నారన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ న్యాయవాదుల మన్నులు పొందుతూ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు ఒక మంచి న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించడమే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారన్నారు. రామిరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిరుపేదలకు వృద్ధులకు వికలాంగులకు అనాధలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టి.నాని, షబ్బు, డాన్ సైదా, మాదాస్ గోపి, సాయి, అరుణ్, కర్ణం గోపి, మాడ నరేష్, సుధాకర్, వీర రాజు, దిల్, కిరణ్, వీరబాబు, అల్వాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin