సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను గురువారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలోని ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఉత్తమ గుణాత్మకమైన విద్యను బోధించాలన్నారు. పాఠశాల తరగతి గదుల్లోనే విద్యార్థులను భావిభారత పౌరులుగా ఉందన్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని సాధ్యమైన సమస్యలను త్వరితగతంగా పూర్తి చేస్తానని పాఠశాల ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందం బిజెపి నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin