సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసు మరియు కేంద్ర బలగాలతో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా ముందస్తు చర్యలలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా పోలీస్ సిబ్బంది మరియు పారా మిలిటరీ సిబ్బంది పోలీసు కవాతుని నిర్వహించారు. పౌరులు ఎన్నికల లోబడి నడుచుకోవాలి. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడిన గొడవలు సృష్టించిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్ పి నాగభూషణం, డి సి ఆర్ బి డి. ఎస్.పి రవి, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాజేష్, మహేష్, సి ఐ లు రాజశేఖర్, అశోక్ రెడ్డి, సర్కిల్ SI లు పాల్గొన్నారు.
-----------------------
Admin