సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠం పల్లి మండలంలోనివరదాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి ముత్యాలమ్మ, అంకమ్మ, ఇంద్రవెల్లి ముత్యాలమ్మ, పోతురాజుల స్థిర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం 4:30 నిమిషాలకు సుప్రభాత సేవ, ఎనిమిది గంటల 30 నిమిషాలకు గణపతి పూజ, కర్మణ: పుణ్యహవాచనం, లక్షణో ద్దారణం, నవకలశప్నపనం,9:30కు గ్రామస్తులంతా దేవతా విగ్రహాలకు పాలు, పెరుగు,తేనె, నెయ్యి, కొబ్బరి జలాలతో పాలాభిషేకం చేయడం జరిగింది, అమ్మవారి విగ్రహాలను గ్రామస్తులంతా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లి అమ్మవారి విగ్రహాలను జలాధివాసం కార్యక్రమంలో భాగంగా విగ్రహాలకు 108 బిందెలతో జలాభిషేకం చేయడం జరిగింది, తర్వాత గ్రామంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని గ్రామమునందు బలి చల్లే కార్యక్రమం చేయడం జరిగింది, సాయంత్రం పీటల మీద కూర్చున్న వారిచే మూల మంత్ర,అదివాస, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ రుద్ర,నవగ్రహ, వాస్తు,శ్రీ దుర్గాసూక్త హోమములు చేయడం జరిగింది, సాయంత్రం 6 గంటలకు ధ్యాన, పుష్ప, ఫల, రస, శాయ్యాదివాసములు, చివరగా వేద స్వస్తి,చతుర్వేద, పారాయణములు, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలకూరి అఖిల, ఉప సర్పంచ్ బత్తుల శంకరయ్య , వార్డు మెంబర్లు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, అందరూ పాల్గొనడం జరిగింది
-----------------------
Admin