సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఈ రోజు "ప్రపంచ ఆరోగ్య దినోత్సవం" పురస్కరించుకొని ఈ సంవత్సరం థీమ్ అయిన"అందరూ ఆరోగ్యంగా ఉండాలని" అనే విషయాన్ని అందరికి తెలియజేయడం జరిగింది. శుక్రవారం గోరంట్ల లోని పులేరు రోడ్ అక్షర జ్యోతి శిక్షణా కేంద్రంలో వలసదారులకు రెడ్ క్రాస్ తరుపున 60 హైజినిక్ కిట్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ జిఎం శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యం కొరకు పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ జీవన ప్రమాణాలు పెంపొందించుకోవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి.బి విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్న వనరులతోనే వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యం గా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఖాదీ బోర్డ్ వైస్ చైర్మన్ చంద్రమౌళి మాట్లాడుతూ రెడ్ క్రాస్ సంస్థ ఇలాంటి నిస్సయకులకు అవగాహన పెంచి సేవ చేయడం చాల గొప్పదన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మేనేజింగ్ కమిటీ మెంబెర్ సాయి దర్శిని మేడ0, రెడ్ క్రాస్ జీవిత సభ్యులు సురేష్,జగదీష్,శ్రీనివాసులు,కోఆర్డినేటర్ బి. రమేష్, వాలంటర్స్ పాల్గొన్నారు.
-----------------------
Admin