Saturday, 01 August 2026 12:39:15 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటాం... - తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఏ. మధు

Date : 04 October 2023 07:11 AM Views : 289

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : సమస్యల పరిష్కారం చేయకుండా కేవలం ఎన్నికల జిమ్మిక్కుగా నియోజక వర్గంలో పర్యటన ఉన్నదని ఉన్న సమస్యలను ఇన్నాళ్లు వదిలేసి ఏదో అద్భుతం చేశామని ఎన్నికల్లో లబ్ది పోoదేలా చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి మేల్కొలుపుతామని స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల యాజమాన్యాలపై వత్తిడి తెచ్చి స్థానిక యువతకు ఎక్కువ ఉపాధి ఉండేలా చర్యలు చేపట్టాలి. షాద్ నగర్ నియోజకర్గంలో దీర్ఘ కాలంగా నెలకొని ఉన్న విద్యారంగంలో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా డిగ్రీ జూనియర్ కళాశాలు ఉన్న అందులో సరైన లెక్చరర్ లు, సిబ్బంది వసతులు లేక విద్యాబోధన సరిగా జరగడం లేదు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టి విద్యారంగాన్ని ఆదుకోవాలి. అంతే కాకుండా నియోజకవర్గంలో అహర్నిశలు శ్రమించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్ట్ సోదరుల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి స్థలాల కోసం వారు ఎన్నో వినతులు తెలిపినా ఇప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. హామీలకు పరిమితం కాకుండా నియోజకవర్గం కేంద్రం లో వారికి కేటాయించేలా తక్షణం ఆదేశాలు జారీచేయాలి. లేదంటే వారీ కోసం యువజన కాంగ్రెస్ పోరాడుతుంది. అంతే కాకుండా ఎన్నో నూతన మండలాలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చరిత్ర కలిగిన. ఎన్నో పోరాటాలకు కేంద్రం గా ఎన్నో రోజులుగా పోరాటం చేసిన మొగిలిగిద్ద గ్రామాన్ని మండల కేంద్రం గా ప్రకటించాలి. పర్యటనకు ముందే సమస్యల పరిష్కారం చేపట్టాలి. కేవలం ఎన్నికల స్టంట్ గా నియోజక వర్గంలో పర్యటన కోసం వస్తే యువజన కాంగ్రెస్ కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటాం అని పత్రిక ముఖంగా డిమాండ్ చేస్తున్నమని హెచ్చరిస్తున్నాము. ఎన్ ఎస్ యుఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పసుల ప్రవీణ్ యాదవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, మైనారిటీ మున్సిపాలిటీ అధ్యక్షుడు అజ్జు భాయ్, కొందుర్గు మండల యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, మున్సిపాలిటీ యూత్ అధ్యక్షుడు నాగరాజు, చింటూ, బిట్టు, వినోద్, సురేందర్, సాయి, ప్రసాద్, నవీన్, నరేశ్, మరియు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ యుఐ నాయకులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: