సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం అందుకుంది హుజూర్ నగర్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలపై సర్వత్ర ఆసక్తి ఉత్కంఠతకు తెర తీస్తూ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించింది గతంలో 2018 లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయటంతో గులాబీ దండు కైవసం చేసుకోగా తిరిగి అదే జోరును ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించి తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది ఈ సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకున్నారు .ప్రతి మండల కేంద్రంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి విజయానందించిన ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారు.
-----------------------
Admin