Saturday, 01 August 2026 01:15:47 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజల భాగస్వామ్యంతోనే రాజ్యాంగ పరిరక్షణ... - కే.ఎన్.పి.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూరం అభినవ్

Date : 06 January 2025 01:39 AM Views : 371

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వాలు గానీ పాలకులు గానీ రాజ్యాంగం పట్ల విధేయత కలిగి ఉండలేరని కుల నిర్మూలన పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూ రం అభినవ్ అన్నారు. ఆదివారం జన విజ్ఞాన వేదిక, ప్రోగ్రెసివ్, సమూహ రైటర్స్ ఫోరం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సామాజికవేత్త డాక్టర్ రాజు అధ్యక్షతన 75 ఏళ్ల భారత రాజ్యాంగం సవాళ్లు అనే అంశంపై చర్చా వేదిక ఆదివారం స్థానిక మిర్యాలగూడలోని బీసీ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా కేఎన్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అర్థం చేసుకునే విధానంలో మనిషి మనిషికి తేడాలు ఉన్నాయని సరైన విధానంలో ఆలోచించినట్లయితే రాజ్యాంగం అందరికీ సమన్యాయాన్ని కల్పించిందని అన్నారు. జన విజ్ఞాన వేదిక నాయకులు డాక్టర్ మువ్వా రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం పట్ల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు పోస్టులు పెడుతున్నారని రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకున్నట్లయితే రాజ్యాంగ విలువలు తెలుస్తాయని సరైన అవగాహన లేకుండా పోస్టులు పెట్టడం తగదని అన్నారు. విద్యావంతుల వేదిక అంబటి నాగయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి పార్లమెంటుకు సమర్పించేటప్పుడు భారతదేశ ప్రజలమైన మేము తమకు తాముగా ఈ రాజ్యాంగాన్ని సమర్పించుకుంటున్నాము అని అనడంలోనే ప్రజాస్వామ్యం నిమిడి ఉందని అన్నారు. కార్యక్రమంలో సమూహ రైటర్స్ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి, భారత్ బచావో జిల్లా అధ్యక్షురాలు ఉదయ, కుల వివక్షత పోరాట సమితి నాయకులు రెమడాల పరశురాం, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుకూరి సుదర్శన్ జై కొండల్ రెడ్డి,కోల శ్రీనివాస్, డిటిఎఫ్ గణేష్, మైనార్టీ నాయకులు మౌజం హుస్సేన్, డాక్టర్ సాహితీ, అరుణ, సుజాత, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: