సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : జీవో నెంబర్ 76 ద్వారా కొత్తగూడెం నడిబొడ్డులో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పట్టాలు పొందేందుకు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి దరఖాస్తు చేసుకున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధి వారి భర్తలు మరియు వారి బంధువులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.... 33 వ వార్డు కౌన్సిలర్ అప్లికేషన్ నెంబర్ 76APLBDD230619006914, గాజుల రాజం బస్తి పేరున 311:00చ"గ"ల ఖాళీ స్థలంలో మరియు 25 వ వార్డు కౌన్సిలర్ అప్లికేషన్ నెంబర్ 76APLBDD230529006728, కూలీ లైన్ రైతు మార్కెట్ కు చెందిన కాళీ స్థలంలో 480:00 చ"గ"లు మరియు అప్లికేషన్ నెంబర్ 76APLBDD230529006730 కూలీ లైన్ రైతు మార్కెట్ కు చెందిన 494:00 చ"గ"ల ప్రభుత్వ స్థలమును ఆక్రమించి అక్రమ పద్ధతిలో ప్రభుత్వ ఉద్యోగులను తప్పుదోవ పట్టించే విధంగా అక్రమ మార్గమును ఖాళీ స్థలాలలో ఇల్లులు లేని ప్రదేశంలో ఇంటి పట్టాలు పొందుటకు దరఖాస్తు చేసుకున్న సదరు వ్యక్తులపై మరియు సహకరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవలసినదిగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ డిమాండ్ చేశారు....
-----------------------
Admin