సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలోనీ కార్మికశాఖ కార్యాలయాలపై సమగ్ర విచారణ జరపి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని సూర్యపేట జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ కోరారు. స్థానిక శాంతి స్థూపం సపేపంలో అడ్డా కార్మికులకు ఈనెల 7న కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే మహాధర్నా కరపత్రాలను విడుదల చేశారు అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు వెల్ఫేర్ బోర్డు సంక్షేమ నిధుల కోసం దరఖాస్తు చేసుకోని సంవత్సరాలకు తరబడి ఎదురు చూస్తున్నారని దరఖాస్తులను పరిష్కరించడంలో కార్మిక శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫలితంగా గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో మూడు వేలకు పైగా పెండింగ్ క్లైములు ఉన్నాయని తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అలాగే అన్ని కార్మిక సంఘాల నాయకులతో అడ్వైజర్ కమిటీని ఏర్పాటు, అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు ఇండ్లు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ హామీ మేరకు వెల్ఫేర్ బోర్డులో నమోదైన ప్రతి కార్మికునికి మోటార్ సైకిల్, 60 సంవత్సరాల దాటిన కార్మికులకు 5000 రూపాయలు పెన్షన్, పనిముట్ల కొనుగోలుకు ఆర్థిక సాయం అందించాలని, వెల్ఫేర్ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమ కొరకే మాత్రమే ఖర్చు చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం జరిగే ఈ మహాధర్నాకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పతల వెంకన్న, జడ్డు బాల శౌరిరెడ్డి, షేక్ ముస్తఫా,పల్లపు రామకృష్ణ, శీలం వేణు, గుండు వెంకన్న, దారా శ్యామ్, నకరికంటి అంజయ్య అశోక్ నజీర్ రాజు, సీతారాములు, రఫీ, సతీష్, కోటయ్య, ధరావత్ లక్ష్మి, గోమి, యాదమ్మ, సైదమ్మ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin