సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో నారాయణపేట జిల్లా కేంద్రాల్లో కార్యక్రమ ఇంఛార్జి వేణు గౌడ్ ఆధ్వర్యంలో హత్ సే హత్ జోడో యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య నాయకులు హాజరై వివిధ ముఖ్య నాయకులు మాట్లాడుతూ, బిజెపి , బిఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచక పాలనను ప్రజలకు వివరించాలని, అదేవిధంగా సామాన్య ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా అధ్యక్షులు మరియు మక్తల్ నియోజకవర్గం నాయకులు వాకిటి శ్రీహరి , నారాయణపేట నియోజకవర్గ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి గీతా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు నాగరాజ్ గౌడ్ ,పోలీస్ చంద్రశేఖర్ , సూగప్ప , కత్తేపల్లి విష్ణువర్ధన్ రెడ్డి , నారాయణపేట జిల్లాలోని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కిసాన్ సెల్ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin