సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పోలుబోయిన శ్రీవాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఘటైన విమర్శలు బిఆర్ఎస్ పార్టీపై చేశారు. మణుగూరు లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తన మాటలను జీర్ణించుకోలేక అనవసరమైన విమర్శలు చేశారని ,ముందు మీరు మీ ఇంటిని చక్కబెట్టుకొని బయటి వారిపై విమర్శలు చేయండి అంటూఖబర్దార్ మరోసారి విమర్శలు చేస్తే అంటూ ఘాటుగా స్పందించారు... కాంగ్రెస్ పార్టీ తనకు పినపాక నియోజకవర్గ సీటు ఇస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని లేదా ఎవరికిచ్చిన కలిసి పనిచేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు... రేగా కాంతారావు కి ఆనాటి కాంగ్రెస్ పార్టీ సీటు ఇస్తే గెలిచిన మూడు నెలలకే పార్టీ మారాడని అది తెలుసుకోండిఅన్నారు. రెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మీరు ఏ విధంగా పార్టీ మారారు, ఏ పరిస్థితుల్లో మారారు , మీకు చెక్ పవర్ ఎందుకు పోయింది ,ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకొని ఇతరులపై విమర్శలు చేయండి అంటూ హితవు పలికారు.... మీ మండలం రమ్మన్నారు నేను వచ్చాను .అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఏం జరగలేదో..మేము చూపిస్తాం మీరు వస్తారా మమ్మల్ని రమ్మంటారా అంటూ టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రతి సవాల్ సవాల్ విసిరారు.... వరద బాధితులకు అన్నం పెట్టం,అది పెట్టాం ,ఇది చేసాం అనేది కాదుగోదావరి వరద బాధితులకు శాశ్వత పరిష్కారం చూపించగలరా .ఎత్తైన ప్రదేశాల్లో ఇల్లు కట్టి ఇవ్వగలరా .అది చేయండి ఫస్ట్ అంటూ ఘాటుగా ప్రశ్నలు స్పందించారు.... మీరు విమర్శలు చేయటం మీ. గొప్పలు మీరుచెప్పుకోవటం కాదు ప్రజాక్షేత్రంలో రాబోయే రోజుల్లో ఓటుతో ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు....
-----------------------
Admin