సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా షాద్ నగర్ డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియాలోని హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏ బి సి మరియు కిషన్ నగర్ ను డాక్టర్ ఎస్ జయలక్ష్మి సెంటర్లను సందర్శించారు. షాద్ నగర్ అర్బన్ లోని హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏలో వచ్చిన పేషెంట్ లందరికీ ఆర్గాన్ డొనేషన్ గురించి వివరంగా తెలియజేశారు. మానవుడు చనిపోయిన తర్వాత తన శరీరమును మట్టిలో పూడ్చి పెట్టడము లేదా కాల్చడము చేస్తారు. అలా చేయడం వల్ల మానవుని శరీరంలో ఎన్నో విలువ కట్టలేని అవయవాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి, అలా మానవుని శరీరంలో అవయవాలు వృధా కాకుండా ఉండాలి అంటే మనము చనిపోయిన అనంతరము మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలు కళ్ళు, గుండె, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు, చర్మము మరియు ఎముకలు, బ్రతికి ఉన్న మనుషులకు అవయవాలు అవసరం ఉన్నవారికి మనము దానము చేసినట్లయితే మనము చనిపోయిన తరువాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడటము, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనము చనిపోయిన అనంతరము కూడా మన అవయవాల కళ్ళ ద్వారా ఈ సమాజాన్న చూడగలుగుతాము, మన అవయవాలు దానం చేయడం వల్ల అవయవా లోపాలు ఉన్నవారికి ఎంతో ఉపయోగపడి, మనము బ్రతికి ఉన్నట్లుగానే ఉంటుంది అని డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలియచేశారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా మన అవయవాల ను మనము చనిపోయిన అనంతరము ఇతరులకు దానం చేయాలి అని అక్కడికి వచ్చిన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఎంఎన్ఎమ్ లు ఇస్తేరు రాణి, విజయలక్ష్మి మరియు ఏ సెంటర్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin