Saturday, 13 June 2026 11:38:23 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

ఆర్గాన్ డొనేషన్ అవగాహన కార్యక్రమం... జిల్లా ఉపవైద్య శాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయలక్ష్మి

Date : 26 September 2023 09:41 AM Views : 282

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా షాద్ నగర్ డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చించోడు ఏరియాలోని హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏ బి సి మరియు కిషన్ నగర్ ను డాక్టర్ ఎస్ జయలక్ష్మి సెంటర్లను సందర్శించారు. షాద్ నగర్ అర్బన్ లోని హెల్త్ వెల్నెస్ సెంటర్ ఏలో వచ్చిన పేషెంట్ లందరికీ ఆర్గాన్ డొనేషన్ గురించి వివరంగా తెలియజేశారు. మానవుడు చనిపోయిన తర్వాత తన శరీరమును మట్టిలో పూడ్చి పెట్టడము లేదా కాల్చడము చేస్తారు. అలా చేయడం వల్ల మానవుని శరీరంలో ఎన్నో విలువ కట్టలేని అవయవాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి, అలా మానవుని శరీరంలో అవయవాలు వృధా కాకుండా ఉండాలి అంటే మనము చనిపోయిన అనంతరము మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలు కళ్ళు, గుండె, ఊపిరి తిత్తులు, మూత్ర పిండాలు, చర్మము మరియు ఎముకలు, బ్రతికి ఉన్న మనుషులకు అవయవాలు అవసరం ఉన్నవారికి మనము దానము చేసినట్లయితే మనము చనిపోయిన తరువాత కూడా మన అవయవాలు ఇతరులకు ఉపయోగపడటము, ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది, మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మనము చనిపోయిన అనంతరము కూడా మన అవయవాల కళ్ళ ద్వారా ఈ సమాజాన్న చూడగలుగుతాము, మన అవయవాలు దానం చేయడం వల్ల అవయవా లోపాలు ఉన్నవారికి ఎంతో ఉపయోగపడి, మనము బ్రతికి ఉన్నట్లుగానే ఉంటుంది అని డాక్టర్ ఎస్ జయలక్ష్మి తెలియచేశారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా మన అవయవాల ను మనము చనిపోయిన అనంతరము ఇతరులకు దానం చేయాలి అని అక్కడికి వచ్చిన వారందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ వెల్నెస్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు, ఎంఎన్ఎమ్ లు ఇస్తేరు రాణి, విజయలక్ష్మి మరియు ఏ సెంటర్ కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :