సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూరు మున్సిపాలిటీలోని హౌసింగ్ బోర్డ్ కాలంలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జూన్ వచ్చే జూలై నెలలో డెంగ్యూ మలేరియా సోకకుండా ఇంటింటికి తిరిగి నిలువ ఉన్న నీటిని తీయించారు. వర్షాకాలంలో నీటి నిల్వ మన చుట్టూ ఉండే పరిసరాల్లో దోమలు వృద్ది చెంది డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సంభవిస్తాయి. కాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ ఇంటి పరిసరాలలో చెత్తను, నిలువ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలని ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాయి, పర్యవేక్షకుడు చంద్రశేఖర్,ఆరోగ్య కార్యకర్త ఆనంద్,ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి,స్వప్న,వనిత,సరిత కవితా,పద్మా,గాయత్రి,సుగుణ, సౌమ్య, మమత తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin