సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో 85 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లు, 22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక, 30 లక్షలతో నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంక్, 20 లక్షలతో స్కూల్ బిల్డింగ్, 12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠధామం ప్రారంభించారు. 15 లక్షలతో మల్టీ పర్పస్ కమ్యూనిటీ హాల్, 10 లక్షలతో ఎస్సి కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలతో గ్రామాలన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో గతంలో ఎన్నడు లేని విధంగా గ్రామాలన్ని అభివృద్ధిని సాధించాయన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వాములు కావాలన్నారు.....
-----------------------
Admin