Thursday, 30 July 2026 08:47:58 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఉపాధి కల్పించాలి... వలసలు ఆపాలి... -సీపీఎం మండల కార్యదర్శి ఎస్ కే యాకూబ్

Date : 04 April 2024 09:00 AM Views : 477

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో ఆందోళన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 39 వేల 865 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే సాగర్ నీళ్లు రాక రైతులు బోర్లు,బావులు కింద 17,000 ఎకరాలు మాత్రమే నాటు పెట్టారని,అందులో 7000 ఎకరాలు ఎండిపోయి పదివేల ఎకరాలు మాత్రమే చేతికొచ్చిందన్నారు.చేతికొచ్చిన పంటకు కూడా కూలీల అవసరం లేకుండా యంత్రాల సహాయంతో పూర్తి చేయడం వలన కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో కరువు పరిస్థితి నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలు వలసలు వెళ్తున్నారని,తద్వారా రోడ్డు ప్రమాదాల్లో అర్ధాంతరంగా మృత్యువాత పడుతున్నారని, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించి వలసలు నివారించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రతి కుటుంబానికి 20 కేజీల సన్న బియ్యం,నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు.అధికారంలోకి రాగానే సన్న బియ్యం ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు.అలాగే కేంద్రంలో 14 మంది ప్రధానమంత్రులు 55 లక్షల కోట్లు అప్పు చేస్తే 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మాత్రం 1125 కోట్లు అప్పు చేసి భారతదేశంలో ప్రతి ఒక్కరి పైన 1,50,000 రూపాయలు చొప్పున అప్పు వేస్తుందన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లదనం వెలికితీసి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి ఇంతవరకు జాడ లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అదాని,అంబానీ లకు బిజెపి ప్రభుత్వం ఉడిగం చేస్తుందన్నారు.ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్ తో నిమిత్తం లేకుండ రోజుకు 600 రూపాయలు ఉపాధి కల్పించి,ఈ వలసలను ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సుజాత రోషమ్మ,గడ్డిరెడ్డి సునీత,పెంటయ్య, పందిరి వీరారెడ్డి,పిచ్చిరెడ్డి,కోట సైదులు,ఏపూరి తిరుపయ్య,బండ్ల సైదులు, యాట ఉప్పమ్మ,ఏపూరి సోమమ్మ,సాలమ్మ,చిలక సరిత,నాగేలు,ముత్యాలమ్మ,గోడ కుమారి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: