సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలంలోని శాంతినగర్ గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రధానమంత్రి మోడీ చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా సోమవారం అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎంతో ఘనంగా గ్రామ ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలు అన్ని శాఖలలో పనిచేస్తున్న అధికారుల సమక్షంలో ప్రారంభోత్సవం చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణ మాట్లాడుతూ శాంతినగర్ గ్రామంలో రైల్వే అండర్ బ్రిడ్జి ని ఏర్పాటు చేయటం ఎంతో ఆనందించ దగ్గ విషయం అని పేర్కొన్నారు అంతే కాకుండా త్వరలోనే ఇదే రైల్వే బ్రిడ్జి మీదుగా కొవ్వూరుకు ప్యాసింజర్ రైలు సర్వీసును ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళిక కూడా సిద్ధమవుతుందని ఆయన తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు వేముల రమణ పరసా వెంకటి దుబ్బాకుల రాము వేముల నరేష్ ఎస్ డి అహ్మద్ బోడ పద్మ మైనార్టీ నాయకులు గఫార్ దస్తగిరి తదితరులు రైల్వే సిబ్బంది రైల్వే శాఖ అధికారులు మరియు అన్ని శాఖల అధికారులు అన్నపురెడ్డిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ షాహినా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగుంట పంచాయతీ పరిధిలోని పాఠశాలల విద్యార్థులు చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ ప్రజలు విశేషంగా హాజరయ్యారు... ఈ కార్యక్రమనికి హాజరైన అధికారులకు ఎమ్మెల్యే ఆదినారాయణ కు హాజరైన అందరికీ మండల కాంగ్రెస్ నాయకులు వేముల రమణ భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది....
-----------------------
Admin