సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణంలో సిపిఐ ఆఫీస్ కి,సిపిఐ నియోజకవర్గ సమావేశానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ.కెప్టెన్ నలమాధ .ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో కాంగ్రెస్ ,సిపిఐ పొత్తులో భాగంగా సిపిఐ కి కొత్తగూడెం కునంనేని .సాంబశివరావు పోటీ చేయనున్నారు, అలాగే పొత్తులో భాగంగా హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నాను భారత కమ్యూనిస్టు పార్టీ చాలా గొప్ప చరిత్ర ఉంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎంతోమంది కమ్యూనిస్టులు గొప్ప నాయకులు ఉన్నారు, ఇప్పుడున్న సమాజంలో పెట్టుబడి వ్యవస్థలో రాజకీయాలని డబ్బు రాజకీయాలైనాయి కానీ కమ్యూనిస్టులు మాత్రమే సాదాసీదాగా ఉంటూ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న గొప్ప నాయకులు అని అన్నారు, అలాగే వ్యక్తిగతంగా కమ్యూనిస్టు అంటే చాలా ఇష్టం. అలాగే 2018 తర్వాత జరిగిన ఎన్నికలు డబ్బుతో కూడిన ఎన్నికలుగా మారడం దానికి ముఖ్య కారణం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధాన కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం విధానం నీతి నిజాయితీ లేని ఏ ఒక్క సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయలేదు అన్ని అబద్ధపు మాటలు ,మాయ మాటలు ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేస్తున్నాడు. కచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 75 నుంచి 80 స్థానాలు గెలుపొందుతుంది అలాగే హుజూర్నగర్, కోదాడు 50 వేల మెజార్టీతో మేము గెలవబోతున్నాం అలాగే ఉచితంగా కరెంటు విధానాన్ని భారతదేశంలో వ్యవసాయక విప్లవాత్మక ముందుకు వేసింది స్వర్గీయులు డా రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుబారా చేస్తూ మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మేడిగడ్డ డామేజ్ లీకేజ్ విధానాన్ని మనం చూస్తున్నాం మరి గతంలో చూస్తే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టు నాగార్జునసాగర్ ,శ్రీరామ్ ప్రాజెక్ట్ ఇలా అనేక ప్రాజెక్టు నిర్మించాం కానీ అవి ఇప్పటివరకు నాణ్యతగా ఉన్నాయి ,మరి మీరు నిర్మించిన ప్రాజెక్టు లీకేజ్ ఏంటి అని అన్నారు. ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా భూకబ్జాలు ,ఇసుక మాఫియా, వైన్ షాప్ లో వాటా ఎక్కడ చూసినా దోపిడి, ఈ ప్రాంతం నేను అభివృద్ధి చేశాను అని చెప్తూ ఈ ప్రాంతంలో ప్రజలకు మాయమాటలు చెబుతూ ఉన్నాడు. ఈ ప్రాంత ప్రజలు చైతన్యవంతులు విద్యావంతులు ఉన్నారు ,అందరూ ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టాలని అని అన్నారు .ఈ కార్యక్రమంలో సిపిఐ ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin