Saturday, 01 August 2026 01:40:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డిసెంబర్ నాటికి ప్రతి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తి అవ్వాలి ...

Date : 21 September 2023 11:00 AM Views : 213

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : హైదరాబాద్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి పంట రుణాలు మాఫీ, నూతన రుణాలు మంజూరు, ఎరువుల సరఫరా, జిఓ 58, 59, గృహాలక్ష్మి, ఆసరా పింఛన్లు, సోషల్ వెల్ఫేర్ ఇంటి పట్టాలు, తెలంగాణ కు హరితహారం, పంచాయతి భవనాల నిర్మాణం, ఆయిల్ పామ్ సాగు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ ఐడిఓసి మినీ సమావేశపు హాలు నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ, ఎరువుల లభ్యత, ఆసరా ఫించన్, ఇంటి పట్టాల పంపిణీ, గృహలక్ష్మి , జీఓ 58 , హరితహారం, పంచాయతీ భవనాల నిర్మాణం, హరితహారం, ఆయిల్ పామ్ వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ లకు పలు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకర్ల నుంచి గ్రామాల వారీగా రుణమాఫీ వివరాలు సేకరించి వ్యవసాయ విస్తరణ అధికారుల సమన్వయంతో రైతులకు ప్రభుత్వం ప్రకటించిన పంట రుణమాఫీతో పాటు నూతన రుణాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. బ్యాంకర్లు నుంచి గ్రామాల వారీగా రుణమాఫీ వివరాలు సేకరించి వ్యవసాయ విస్తరణ అధికారులచే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు. అక్టోబర్ మాసం నాటికి కేటాయించిన మేర ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించుకుని సాధన దిశగా కృషి చేస్తామని కలెక్టర్ సూచించారు. రైతు రుణమాఫీ సంబంధించి చివరి రైతు వరకు లబ్ది చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని, బ్యాంకర్లను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు లభించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రానున్న 15 రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 59 కి సంబంధించి అర్హులందరికీ పట్టాలు పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించి జిల్లాకు కేటాయించిన ఇండ్లకు లబ్దిదారులను త్వరితగతిన ఎంపిక చేసి, రెండు వారాల్లో ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ పూర్తి చేయాలని సీఎస్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులకు గ్రౌండింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని, డిసెంబర్ నాటికి ప్రతి గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, అటవీ అధికారి కిష్టా గౌడ్, డిఆర్డీఓ మధుసూదన్ రాజు, డిఆర్వో రవీంద్ర నాధ్, ఉద్యాన అధికారి మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఎల్డిఎం రామిరెడ్డి, ఆర్డిఓ లు శిరీష, మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు. జిఓ 59 ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేస్తాం... -కలెక్టర్ డా ప్రియాంక అల.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: