సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం మామిళ్లకుంట్లపల్లి గ్రామంలో మినీ అంగన్వాడి సెంటర్ నందు భవిష్యత్ తరాలు పిల్లల ఆరోగ్యం కోసం మంగళవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం చేపట్టిన మినీ అంగన్వాడీ కార్యకర్త శ్యామల నిర్వహించారు. మినీ అంగన్వాడీ కార్యకర్త మాట్లాడుతూ ఐసిడిఎస్ సూపర్వైజర్ జయమ్మ ఆదేశాలు మేరకు అంగన్వాడి పిల్లలకు ఒక సంవత్సరం నుండి 5 సంవత్సరం పిల్లలకు నులిపురుగులు నివారణ మాత్రలు వేయడం జరిగినది. ఈ కార్యక్రమము ముఖ్య ఉద్దేశ్యము ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నివారణ కార్యక్రమం చెయ్యి పట్టడంజరిగినది. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని మార్చి 14, తేదీలలో నిర్వహిస్తున్నామని, అన్ని అంగన్వాడీ -కేంద్రాల్లో 1-19 సంవత్సరాల వయసు లోపు ఉన్న పిల్లలందరికీ నులి పురుగుల నివారణ నిర్మూలన ఆల్బెండజోల్ 400 మి. గ్రా మాత్రలను మధ్యాహ్న భోజన అనంతరం అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న 1-2 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ అర్థ మాత్రను 3-5 సంవత్సరాల వయస్సు పిల్లలందరికీ ఒక మాత్రను మింగించాలి.ఆరోగ్యవంతమైన యువ సమాజం కోసం నేటి చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మన అందరి బాధ్యతని గుర్తoచాలి. అని మామిళ్ళకుంట్లపల్లి మినీ అంగన్వాడీ కార్యకర్త శ్యామల తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ శ్యామల ,గర్భవతులు, బాలింతలు పిల్లలు , కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin