సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : తెలుగు ప్రజలందరికీ శ్రీ శోభ కృత్ నామ సంవత్సర సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభమయ్యే ఉగాది కొత్త లక్ష్యాలకు దోహదపడాలని తెలిపారు. ఉగాది పండుగ తెలుగు వారందరికీ ఎంతో ప్రీతికరమైనదని అన్నారు. ఉగాది తోనే మనకు సంవత్సరం ప్రారంభమవుతుందని తెలిపారు. ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు ఆనందంతో పాటు సిరి సంపదలు ప్రసాదించాలని భగవంతుని కోరుతున్నట్టు పేర్కొన్నారు.
-----------------------
Admin