సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్నగర్ టౌన్ లో లోకల్ ఆటో యూనియన్ మరియు ఎర్రారం అడ్డ యూనియన్ ఆటో కార్మికులు దాదాపు 200 మంది రాష్ట్ర ఐ ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎరగాని నాగన్న సమక్షంలో ఐ ఎన్ టి యు సి లో చేరినారు. వారికి ఐ ఎన్ టి యు సి కండవలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగన్న గౌడ్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు కాంగ్రెస్ మ్యానీ ఫేస్టొ లో చేర్చిన విధంగా సంవత్సరానికి 12,000 వేల రూపాయలు మరియు ఆటో కార్మికులు ఉచిత బస్సు ప్రయాణం తో నష్టపోతున్నందుకు వారికి నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. మరియు కేంద్రం తెచ్చిన జీవో 106 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పేద ఆటో కార్మికులందరికీ ఇల్లు ఇండ్ల స్థలాలు అందిస్తామని తెలిపినారు.ఇట్టి కార్యక్రమానికి హాజరైన ఆటో నాయకులు బైరు సతీష్ చింతకాయల శివాజీ కేశరాజు గోపి లక్ష్మయ్య ఆధ్వర్యంలో 200 మంది కార్మికులు చేరినారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నాయకులు నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య. పట్టణ అధ్యక్షులు పాశం. రామరాజు మాజీ కౌన్సిలర్ చింతకాయల రాము. మండల అధ్యక్షులు మేళ్లచెరువు ముక్కంటి. పార్ బాయిల్డ్ రైస్ మిల్లు యూనియన్ అధ్యక్షులు ఎస్ జానయ్య. జిల్లా ఐఎన్టిసియు నాయకులు వల్లపు దాసు రాజు. పవన్. సోను. సాయి లతీఫ్. మరియు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin