సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవరచెరువు మండలం అల్లా పల్లి గ్రామ సచివాలయం ను ఎంపీడీఓ కే.పోలప్ప ,ఈ ఓ ఆర్ డి రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి విధులు పట్ల తగు సూచనలు చేసినారు. ప్రతిరోజు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయవలెను.మూమెంట్ రిజిస్టర్ నందు తప్పనిసరిగా ఫీల్డ్ కు వెళ్ళు వివరములు నమోదు చేయవలెను. సచివాలయ సిబ్బంది మధ్యాహ్నం 3 గంటలలోపు వారి ఫీల్డ్ లేదా మీటింగులు పూర్తి చేసుకుని తప్పనిసరిగా 3 నుంచి 5 వరకు స్పందన కార్యక్రమంకు హాజరుకావలెను. పెండింగ్లో ఉన్న సర్వేలు, ఈకేవైసీ మరియు సర్వీసులు సిఎల్ ఏ లోపు పూర్తి చేయవలెను అని ఆదేశించడం జరిగినది. అనంతరం అల్లాపల్లి సచివాలయం , పరిధి లోని రైతు భరోసా కేంద్రం లో జరుగుతున్న వేరుశెనగ విత్తన పంపిణీలో బాగంగా రైతుల రిజిస్ట్రేషన్ జరుగుతున్న కార్యక్రమాన్ని ఎంపిడిఓ పోలప్ప హాజరు అయ్యి పరిశీలించడం జరిగింది . అనంతరం ఓబులదేవర చెరువు మండలం మామిళ్ళకుంట్లపల్లి గ్రామపంచాయతీ మజారా సుందరయ్య కాలనీ నందు గృహ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోలప్ప, గ్రామపంచాయతీ సర్పంచ్ ,ఈవో ఆర్ డి రాజశేఖర్,అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించారు. అనంతరం ఓబులదేవర చెరువుమండలంలోని తుమ్మలకుంటపల్లి గ్రామము నందు ఎగవ చెర్లోపల్లి మరియు పెద్దసానివారిపల్లెలో హౌసింగ్ నాట్ స్టార్టెడ్ ఇళ్లపై ఎంపీడీవో పోలప్ప, ఇంజనీరింగ్ అసిస్టెంట్ అవగాహన కల్పిస్తున్నారు....
-----------------------
Admin