సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ మండలం బూరుగడ్డ మాచవరం గ్రామానికి చెందిన కంపాటి సైదులు అనారోగ్యం తో మరణించారు. నిరుపేద కుటుంబాలకు రఘు చేయూత ద్వారా అందిస్తున్న సేవలు తెలుసుకున్న గ్రామస్తులు ఫోన్ ద్వారా ఓజో ఫౌండేషన్ ఛైర్మన్ పిల్లుట్ల రఘు అన్న కు తెలియజేశారు. ఇట్టి విషయం తెలుసుకున్న ఓజో పౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ మండల సభ్యులు గండు మధు,సిద్దుల వెంకటేష్ , కంపాటి నాగరాజు, ముదిగొండ ఉపేందర్, జొన్నలగడ్డ రవి, దాసరి రాంబాబు, తమలపాకులు వెంకన్న, సూరపల్లి పాపయ్య, కంపాటి ముత్తయ్య వారి కుటుంబ సభ్యులు కంపాటి నాగరాజు, కంపాటి వేణు ,కంపాటి నరసింహ రావు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin