సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ గిరిజన బ్రోచర్ ఆవిష్కరించిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం, గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు ఇస్లావత్ బాలాజీ నాయక్ ఓ యూ జె ఏ సి , అడ్వకేట్, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హుజుర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పై బ్రోచర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ ప్రభుత్వం - బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం.. గిరిజనులు జీవితాల్లో వెలుగును నింపుకుందాం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల గిరిజన నాయకుల అభిప్రాయంతో గిరిజన సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పై కరపత్రాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది.హుజూర్ నగర్ నియోజకవర్గంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ వారసుడిగా సేవాలాల్ ఆలోచన విధానాన్ని తండ తండాలకు వ్యాపింపజేసి సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధన కోసం నిత్యం శ్రమిస్తున్న మన ప్రియతమ నేత, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గారని, సీఎం కేసీఆర్ నాయకత్వం లో మన నియోజకవర్గంలోని అన్ని తండాలలో గిరిజనులకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రo ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ గిరిజనులంతా ఏకమై, శానంపూడి సైదిరెడ్డి ని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఇస్లావత్ల్ బాలాజీ నాయక్,గిరిజన నాయకులు, తదితరులు కోరారు.ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల గిరిజన ప్రజా ప్రతినిధులు , ముఖ్య నాయకులు మరియు మండల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin