సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మాదిగ జర్నలిస్టు ఫోరం (ఎంజేఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా కనుకు వెంకటేశ్వర్లు (ఆంధ్రప్రభ) ఎన్నికయ్యారని శనివారం తెలిపారు. కొత్తగూడెంలో జరిగిన జిల్లా ప్రథమ మహాసభలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేడి గుణ సురేష్ (ఆంధ్రజ్యోతి), కోశాధికారిగా వాసాల సంపత్ (సాక్షి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా బొమ్మెర ముత్యం (వీ6 ఛానల్), దాట్ల రవీందర్ (సాక్షి టీవీ), కనుకు రమేష్, కోండ్రు శ్రీనివాస్ (మనం), పులిగుజ్జు వసంత్, జాయింట్ సెక్రటరీలుగా మెలుగూరి సందీప్, అరికెల వేణు (ఆంధ్రప్రభ), కొడారి వెంకటేశ్వర్లు(నవతెలంగాణ), తంబర్ల పుల్లారావు(ఐన్యూస్), తాండూరి శేఖర్, కొండా జంపన్న, కార్యవర్గ సభ్యులు అనుమలగుర్తి అబ్బురాం(ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), ఇల్లెందుల దుర్గా(నమస్తే తెలంగాణ), రాజశేఖర్, బరిగెల భూపేష్, బండారి శేఖర్, సరికొండ ప్రసాద్లను ఎన్నుకున్నారు. -ఎంజేఎఫ్ కొత్తగూడెం డివిజన్ కమిటీ ఎన్నిక : ఎంజేఎఫ్ కొత్తగూడెం డివిజన్ కమిటీ అధ్యక్షునిగా వాసాల శేఖర్ (సాక్షి) ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తాండ్ర రాజ్కుమార్ (సూర్య), కోశాధికారిగా భాగం విద్యాసాగర్ (ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షులుగా అంతడుగుల రాజశేఖర్ (సాక్షి), బరిగెల భూపేష్, చాపలమడుగు నర్శింహారావు, ఉప్పరి రాంచందర్, జాయింట్ సెక్రటరీగా చదలవాడ సూరి తదితరులు ఎన్నికయ్యారు. -మణుగూరు డివిజన్ కమిటీ : ఎంజేఎఫ్ మణుగూరు డివిజన్ కమిటీ అధ్యక్షునిగా కొడారి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కనుకు రమేష్, గద్దల ఏడుకొండలు, ఇల్లెందుల సురేష్, ప్రధాన కార్యదర్శిగా పొడుతూరి ప్రసాద్, జాయింట్ సెక్రటరీగా ములకలపల్లి గోపినాథ్, బచ్చలకూర వెంకట్, గారపాటి సుధాకర్, కోశాధికారిగా మచ్చా సురేష్, ప్రచార కార్యదర్శిగా గొల్లపల్లి నరేష్, కార్యవర్గ సభ్యులుగా తోకల మోహన్రావు, మచ్చా ఫ ృథ్వీ, దానూరి శ్రీనివాస్, అవులూరి వంశీ, సత్రంపల్లి సారయ్య, లంజపల్లి ముత్యాలరావు, శంకర్, సాయికుమార్, నర్శింహారావులు ఎన్నికయ్యారు. -భద్రాచలం డివిజన్ కమిటీ : భద్రాచలం డివిజన్ అధ్యక్షులుగా పులిగుజ్జు వసంతరావు ఎన్నికయ్యారు. సెక్రటరీగా అరికెల వేణు, కోశాధికారిగా కొమ్ము శ్రీనులను ఎన్నుకున్నారు. ఇల్లెందు డివిజన్ కమిటీ: ఎంజేఎఫ్ ఇల్లెందు డివిజన్ కమిటీ కన్వీనర్గా బొమ్మెర ముత్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
-----------------------
Admin