సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి : మండల పరిధిలోని ఎస్సిబి నగర్ ఎస్.ఆర్ కళాశాలలో జోనల్ ఇంచార్జ్ సతీష్ ఆద్వర్యంలో ఫేర్వెల్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జోనల్ ఇంచార్జ్ సతీష్, కళాశాల ప్రిన్సిపల్ అశోక్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల జోనల్ ఇంచార్జ్ సతీష్, ప్రిన్సిపాల్ అశోక్ లు మాట్లాడుతూ విధ్యర్దినిలు ఏకాగ్రతతో చదువుకొని ప్రతిభ చాటాలని, ప్రతి విద్యార్ధిని ప్రణాళిక బద్దంగా సబ్జెక్టు లను చదువుకోవలన్నారు. సబ్జేకట్ లపై ఏమైనా అనుమానాలు వుంటే సంబంధిత అధ్యాపకులను సంప్రదించి నివృతి చేసుకోవాలన్నారు. పరీక్షా సమయాలలో ఒత్తిడిని జయించాలన్నారు. ప్రతి విద్యార్ధిని ఒకరితో ఒకరు స్నేహభావంతో వుంటూ ప్రశాంత వాతావరణం లో కళాశాల ఆవరణలో గడపలన్నారు. తల్లి, తండ్రులు తమపై పెంచుకున్న నమ్మ కాన్ని వమ్ము చేయకుండా చదువుకోవాలన్నారు. పరిక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించి చదువు నేర్పిన కళాశాల అధ్యాపకులకు, తల్లి తండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకోని రావాలన్నారు. కష్టపడి చడువుతేనే జీవితం లో వివిధ రంగాలలో స్తిరపడ వచ్చన్నారు. ఆటపాటలతో క్లాసికల్ డాన్సులతో విద్యార్థుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ డ్యాన్సులు వేసుకున్నారు. వారికి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేశారు. విద్యార్థులకు చదువుతోపాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా అవసరమేనని ఈ అవకాశాన్ని కల్పించిన జోనల్ ఇన్చార్జి కి కళాశాల ప్రిన్సిపల్ అశోక్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తిరుమలరెడ్డి, క్రాంతి,అలాగే లెక్చరర్స్ శ్రీనివాసరావు, నర్సారెడ్డి, గోపాలకృష్ణ, రాజేష్ ,హుస్సేన్, యాకోబ్ పాషా, పరంజ్యోతి,శ్యామ్ నాన్ టీచింగ్ స్టాఫ్ షకీల్, పరిమిల, రాధిక, స్రవంతి,సౌజన్య పాల్గొన్నారు.
-----------------------
Admin