సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : చెన్నారావుపేట మండలంలోని ఖాదర్ పేట గ్రామంలో బుధవారం పాత్రికేయులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కూస సుదర్శన్ ఆధ్వర్యంలో నూతనంగా వీధుల్లో చేరిన జిపిఓ రమేష్ కు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ గ్రామానికి జిపిఓగా మంచి పనులు గ్రామాభివృద్ధికి ఎప్పటిక ప్పుడు స్పందించి ప్రజలతో మమేకమై మీయొక్క విధులను సమర్థవంతంగా నిర్వర్తించుకొంటూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు అందే విధంగా మీ యొక్క సేవలు గ్రామ ప్రజలకు అవసరమని అన్నారు. అదేవిధంగా మీ గొప్ప సంకల్పం ఈ ఉదయంతో మొదలై మంచి మనసుతో అది అందరికీ ఉపయాగ పడాలనీ కోరారు. ఈరోజు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు గూడ మహేందర్ ఉపాధ్యక్షులు కూస సాయిబాబు మాజీ వార్డుమెంబర్ చాపల మధుకర్ యూత్ అధ్యక్షులు కూస కరుణాకర్ నాయకులు పెద్ది చంద్రయ్య చెవ్వ యాదగిరి మల్లయ్య, గూడ రమణారెడ్డి కోనుకటి కుమారస్వామి కూస రాంకుమార్ గుంటి రాజశేఖర్ వైనాల సందీప్ ఆశ కార్యకర్త నాగెల్లి సమ్మక్క సిబ్బంది కారోబార్ రాజు ఎల్లమ్మ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Reporter