సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ పట్టణంలోని డాక్టర్ జె. రాజేష్ రెడ్డి ఏర్పాటు చేసిన కేర్ సిటీ స్కాన్ సెంటర్ తో పాటు డాక్టర్ సురేష్ ఆర్థోపెడిక్ వైద్యశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటుచేసిన వైష్ణవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లను ఎమ్మెల్యే లు ప్రారంభించారు.... ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఖమ్మం వంటి నగరాలకు దీటుగా కోదాడ పట్టణంలో అత్యధిక వైద్య సేవలను అందుబాటులోకి చేస్తున్న వైద్యులను వారు అభినందించారు. ప్రాణాపాయ స్థితిలో వచ్చిన పేషెంట్ కు వైద్య సేవల నుంచి ప్రాణాలు కాపాడాలన్నారు. వైద్య సేవలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారాలు అందిస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో వైద్య సేవలు ఉండాలన్నారు. వైద్య అభివృద్ధి తోనే సమాజ శ్రేయస్సు మనుగడ సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యాలు ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో డైరెక్టర్ యం మధు, సుదర్శన్ రెడ్డి, డా.సుబ్బారావు,.డా రామారావు,డాక్టర్. శ్రీపతి రెడ్డి, డాక్టర్. ప్రమీల, డాక్టర్. కళ్యాణ్ చక్రవర్తి, డాక్టర్. అశోక్ కుమార్, వైష్ణవి, మల్టీ స్పెషల్టి హాస్పిటల్ చైర్మన్ నక్క రాముడు, ప్రధాన సలహాదారులు చల్ల ప్రకాష్, డాక్టర్. నక్క అభిరామ్, డాక్టర్. వైష్ణవి డాక్టర్. జబీనా, బిఆ ర్ ఎస్ పార్టీ నాయకులు, పట్టణ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin