Thursday, 30 July 2026 08:03:52 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి...

Date : 24 December 2024 10:19 AM Views : 455

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో అధికంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యని నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగ మున్సిపల్ సిబ్బంది, పోలీస్ అధికారులు, ప్రజా ప్రజా ప్రతినిధులు, సంఘాల నాయకులు కలసి పట్టణంలోని ఫ్లైఓవర్ నుంచి బస్టాండ్, డాక్టర్స్ కాలని, గణేష్ మార్కెట్, పెద్ద బజార్ గుండా రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి బస్టాండ్వరకు ట్రాఫిక్ నియంత్రణ అవగాహన ర్యాలి నిర్వహించడం జరిగింది... ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో రోజు రోజుకు జనాభా, వ్యాపార సంస్థలు పెరుగుతున్నప్పటికి పెరుగుతున్న జనాభా ప్రకారం కావాల్సిన వసతులు మాత్రం గత 20 సంవత్సరాలుగా ఏమాత్రం మారలేదు అని అన్నారు.... మన మిర్యాలగూడ పట్టణంలో ఒకే ఒక్క ప్రధాన రహదారి ఉండటం మూలాన, వ్యాపార సంస్థలు అన్ని ఒకే రోడ్డుపై ఉండటం మూలాన రోజు రోజుకు ట్రాఫిక్ సమస్య అధికమవుతుంది అని అన్నారు.గత వైఫల్యాల గురించి చర్చించుకోవడం మానేసి సమస్య పరిష్కారం కోసం మనం చేయాల్సిన కార్యాచరణ ఏంటి అని ఆలోచించి గత నెల రోజులుగా ప్రతీ రోజూ రోడ్డుపై ఉన్న వ్యాపారస్తులకు , ప్రజలకు తగు సూచనలు చేస్తూ పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు శ్రమిస్తూ ఉన్నారు.కేవలం ప్రజా ప్రతినిధులను, అధికారులను సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం, విమర్శించడం కాకుండా తమ వంతు బాధ్యతగా ప్రతీ పౌరుడు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తూ పరిష్కారం వెతకాలి అని అన్నారు.అందరం బాధ్యతతో కలసి పనిచేస్తేనే ఈ సమస్యకి పూర్తి పరిష్కారం జరుగుతుంది అని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం మేము చేస్తున్న ఈ కార్యక్రమాలు , మేము తీసుకుంటున్న ఈ నిర్ణయాలు వ్యాపారులను, ప్రజలను తాత్కాలికంగా కొంచెం ఇబ్బంది పెట్టినా.. దీని ఫలితం భవిష్యత్తులో తెలుస్తుంది అన్నారు ఇప్పుడు నన్ను విమర్శించినా పర్వాలేదు కానీ భవిష్యత్తులో నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరే అభినందిస్తారు అని అన్నారు.ప్రజలు, ప్రయాణికులు, వ్యాపారులు ప్రతిఒక్కరూ అధికారులకు సహకరించండి అందరం కలిసి ట్రాఫిక్ సమస్యని సునాయాసంగా పరిష్కరించగలం అనే సందేశాన్ని పంపేందుకే ఈ రోజు ఈ అవగాహన ర్యాలీ నిర్వహించాము అని అన్నారు... ఈ కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ విజయవంతం చేసిన పోలీస్ అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు, సంఘాల నాయకులకు, రైస్ మిల్లర్స్ కి, డాక్టర్స్ యూనియన్ వారికి, ప్రజలకు, బ్రదర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: