సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు, విద్యా ప్రగతి స్ఫూర్తిదాయక కథనాల మాసపత్రిక నిలువురాళ్లు ప్రతిని గౌరవ శాసన సభ్యులు డా. చిట్టెం పర్ణిక రెడ్డి మరియు వాకిటి శ్రీహరి లకు జిల్లా ఏఎమ్ఓ విద్యాసాగర్, ఎస్.ఓలు నాగార్జున రెడ్డి, శ్రీనివాసులు సీఎమ్ఓ రాజేందర్ అందజేశారు. ఈ సందర్భంగా డా. చిట్టెం పర్ణిక రెడ్డి గారు మాట్లాడుతూ, విద్యాభివృద్ధికి తాను ఎల్లపుడు ముందుంటానని, చిన్నారులతో మాట్లాడడం ఉపధాయ్యులను ప్రోత్సహించేలా వారి ఉత్తమ పద్ధతులను జిల్లా అంతటా తెలియజేసే పత్రికను తీసుకువచ్చిన విద్యాశాఖను అభినందించారు. వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతూ, విద్యకు తన నిధులల్లో 35% కేటాయిస్తానని, స్థానిక ముడుమాల్ నిలువురాళ్ళ ఖ్యాతిని అందరికి తెలియజేసేలా మౌలిక సదుపాయాలను కల్పిస్తానని, విద్యార్థులకు,పాఠశాలభివృద్ధికి ఎల్లపుడు సహాయం అందిస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో మొదటి సారి మన జిల్లా నుండి విద్య మాస పత్రిక వెలువడడం అభినందనియం అన్నారు. ఉపాధ్యాయులు తాము పాఠశాలలో కనబరచిన విద్యార్థుల సృజనాత్మకత, ఉత్తమ కార్యక్రమాల అంశాలను పేర్కొంటూ రూపొందుతున్న ఈ పత్రిక అభినందనీయమని, ఈ మాస పత్రిక లో జిల్లా విద్యాశాఖ, ఉపాధ్యాయులందరూ స్పందించి తమ రచనలను, అమూల్యమైన సూచనలను అందజేస్తూ మాసపత్రికను ప్రతినెల విజయవంతం చేయాలని కోరారు. అదే విధంగా మాసపత్రిక రచనకు కృషి చేసిన డిఆర్పి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లా విద్యాశాఖ నుండి నిలువురాళ్లు పేరుతో వెలువ డుతున్న ఈ విద్యా ప్రగతి సంచిక జిల్లాలో ఉన్నటువంటి 672 ప్రభుత్వ,ప్రయివేటు పాఠశాలకు దాతల సహకారంతో ఉచితంగా అందించబడుతుంది. ఈ సంచికలో పాఠశాల యొక్క అభివృద్ధి, బాల బాలికల యొక్క మానసిక వికాసం కొరకు అంశాలు, పాఠశాలలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలు , సులభతరమైనటువంటి బోధన వ్యూహాలు, ఉత్తమ ఫలితాల పాఠశాల వివరాలు, పిల్లల సృజనాత్మక అంశాలు, సూక్తులు క్విజ్ తదితర అంశాలను పొందుపరిచి ప్రతినెల ఈ మాసపత్రికను పాఠశాలలకు చేరవేస్తామని సంపాదకులు ఏఎంఓ విద్యాసాగర్ గారు పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిసోర్స్ పర్సన్స్ నరేందర్, రాఘవేంద్ర, శ్రీనివాస్, శ్రీకాంత్, భాస్కర్ రెడ్డి , అపర్ణ ,శెట్టి వెంకటేష్ లు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin