Friday, 31 July 2026 01:04:19 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని పకడ్బందీగా చేపట్టాలి...

Date : 05 January 2024 03:40 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ నియోజక వర్గాల ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ పై ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి లతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 489 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని , డేటా ఎంట్రీ ఆపరేటర్ల కు 5వ తేదీన కలెక్టరేట్ నందు డేటా ఎంట్రీ విధివిధానాలపై ఉదయం 10.30 కి ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రజాపాలన చివరి రోజు వరకు దాదాపు 4 లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో 475 జి.పి లకు గాను 389 బృందాలు అలాగే ఐదు మున్సిపాలిటీలు 100 బృందాలు నియమించామని పేర్కొన్నారు. డేటా ఎంట్రీ లో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఎంట్రీ ఆపరేటర్ల మౌలిక సదుపాయాలు కల్పించాలని 5వ తేదీన నియోజక వర్గ మండలాల వారీగా సబందిత అధికారులతో వెబెక్స్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుందని ముందుగా 6.00 గంటలకు హుజూర్ నగర్, కోదాడ 6.45, సూర్యాపేట 7.30 అలాగే తుంగతుర్తి 8.15 గంటలకు కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు, కౌంటర్ ఇంఛార్జీలు తప్పక పాల్గొనాలని కలెక్టర్ ఈ సందర్బంగా సూచించారు. ఈ సమావేశంలో జెడ్.పి. సి.ఈ. ఓ సురేష్ కుమార్, డిఆర్డీఓ. కిరణ్ కుమార్, డి.పి.ఓ యాదయ్య, సి.పి.ఓ జి. వెంకటేశ్వర్లు, డి డెబ్లు ఓ జ్యోతి పద్మ, డి ఎం హెచ్ ఓ డా. కోటా చలం, ఏ.ఓ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: