సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట ,చెరుకుపల్లి, రేగళ్లపాడు గ్రామాలలో మేళతాళలతో, కోలాటనృత్యాలతో, బతుకమ్మలతో జననేత ఎమ్మెల్యే సండ్ర కుఘనకు ప్రజలుఘన స్వాగతం పలికారు. సత్తుపల్లి మండలం రేగళ్లపాడు, యతలకుంట, చెరుకుపల్లి గ్రామాలలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్లు,ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, పేదింటి అడబిడ్డలకు పెళ్ళి కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న కళ్యాణలక్ష్మి చెక్కులతో పాటుగా తన సొంత ఖర్చులతో చీరలను ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లబ్ధిదారులకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగాఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.... రైతన్నలకు 24 గం.ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ఆదివాసీ బిడ్డలకు వారు సాగుచేసుకుని పంటలు పండించుకుంటున్న రైతు సోదరులకుపట్టాదారు పాస్ పాస్ పుస్తకాలనుఇచ్చి ,వారికి కూడ రైతుబంధు పడేలా చూస్తానన్నార ని ఆయన అన్నారు. ప్రస్తుతం గిరిజనులకు వున్న 4% రిజర్వేషన్లు 10% పెంచిన కేసీఆర్ అభినవ అంబేద్కర్ మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడినారు. మన రాష్ట్రంలో జరిగే సంక్షేమ ఫలాలు, అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్ర ప్రభుత్వము ఎన్ని అడ్డంకులు సృష్టించినను మన రాష్ట్రములో జరిగే అభివృద్ధి సంక్షేమ ఫలాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు... కులము లేదు,మతము లేదు పేదరికమైన గీటురాయిగా పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కుతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మీరంతా అండగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
-----------------------
Admin