సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సుధిర్ధ పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరులకు జోహార్లు తెలియజేసుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉండాలని మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు వస్కుల జయరాజ్ అన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాటంలో అమరులైన మాదిగ అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను రాష్ట్ర కమిటీ అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ అదేశాను సారం మఠంపల్లి మండల కేంద్రంలో దళిత ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు మఠం పల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వస్కుల జయరాజ్ ( రామయ్య) చేతుల మీదుగా విడుదల చేశారు . ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ పోరాటంలో ఏ బి సి డి ల వర్గీకరణ కొరకు ఎంతోమంది అమర వీరులు తమ కుటుంబాలను తమ జీవితాలను లెక్కచేయకుండా ఏబిసిడి వర్గీకరణ అయితే నా జాతి బాగుపడుతుందని వారి జీవితాలను త్యాగం చేసి అమరులయ్యారని తెలిపారు.రిటైర్డ్ గ్రామ కార్యదర్శి దళిత ఉద్యోగ సంఘాల నాయకులు చిలక గురవయ్య మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో 1994 .లో 20 మంది యువకులతో మొదలైన ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరాటం మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఒక మాదిగలకే కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడిన సంగతి మనందరికీ తెలుసు పాలకులకు ఎన్నికలు వచ్చినప్పుడు ఎమ్మార్పీఎస్ ను ఒక యంత్రాంగంగా వాడుకొని ఓట్లు వేయించుకొని మాదిగలను బానిసలుగా చూస్తున్నారే తప్ప వాళ్లకి చిత్తశుద్ధి ఉంటే బిజెపి ప్రభుత్వం ఎస్సీల ఏబిసిడిలు వర్గీకరణ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో చేస్తామని చెప్పి ప్రగల్పాలు పలికి మూడోసారి అధికారంలోకి వచ్చిన వర్గీకరణ విషయం ఇంతవరకు మర్చిపోయారని ఎద్దేవా చేశారు . కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బచ్చల కూరి బాబు మాట్లాడుతూ జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఏ బి సి డి ల వర్గీకరణ కోసం అమరులైన అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి త్యాగాలు వృధా కావు అనే పద్ధతిలో హైదరాబాదులో లోయర్ ట్యాంక్ బండ్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు సభ జర్నలిస్టులు నిర్వహించడం ఉద్యమంలో మరణించిన వారిని గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరమని కావున ఏబిసిడిలో వర్గీకరణనకు దళిత బిడ్డగా మా మద్దతు సహకారం అందిస్తామని అన్నారు. గిరిజన జర్నలిస్టు సంఘం జిల్లా నాయకులు మాలోతు రవీందర్ నాయక్ మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన డిమాండ్లని ఈ యొక్క వర్గీకరణకు మా కుల సంఘం తరఫున కూడా మద్దతు తెలుపుతున్నామని మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి జర్నలిస్టు అదేవిధంగా ప్రతి మేధావి వర్గానికి చెందినవారు అందరు కూడా ఈ సమావేశానికి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో మాదిగ ప్రజా ప్రతినిధులు జర్నలిస్ట్ మిత్రులు టీఎస్జెఏ హుజూర్నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చిలక సైదయ్య,పల్లె సుధాకర్ తదితరులు, పాల్గొన్నారు.
-----------------------
Admin