సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రం లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చిట్టెం సాయి కృష్ణ ఎన్నికైన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మండల యూత్ అధ్యక్షుని సాయి కృష్ణ ను పోటీపడిన గార్లపాటి క్రాంతి కుమార్ కు శాలువా తో సత్కరించారు.పలువురు నాయకులు ,కార్యకర్తలు, హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మన ములుగు జిల్లా లో నీ ఏటూర్ నాగారం బస్ డిపో శాంక్షన్ అయినందువల్ల ఏజెన్సీ మండలాల్లో ప్రజలకు రవాణా సౌకర్యం బాగుంటుందని ఈ డిపో మంజూరీ వలన అంతర్రాష్ట్ర రవాణా మరింత మెరుగుపడుతుందని వెంకటాపురం మండల కాంగ్రెస్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ యొక్క కార్యక్రమంలో మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు...
-----------------------
Admin