సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజక వర్గం లో బి.ఆర్.యస్ నాయకులు,కార్యకర్తలు కారు పార్టీ వీడి హస్తం గూటికి చేరుకున్నారు.హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు కాసోజు శంకరమ్మ కు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు..ఆమె తో పాటు మరి కొందరు నాయకులు మాజీ నగర్ పంచాయతీ చైర్మన్ జక్కుల వెంకయ్య,మాజీ యం.పి.పి లు నర్సింగ్ వెంకటేశ్వర్లు గౌడ్,అన్నెం శోరిరెడ్డి ,కౌన్సిలర్ జక్కుల వీరయ్య, తండు సాయిరాం గౌడ్,గొలగోపు నవీన్ యాదవ్, నందిగామ శంభయ్య తదితరులు పార్టీ లో చేరారు. .వారిని మంత్రి ఉత్తమ్ పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లు అని తెలుసుకుని చరిత్ర సృష్టిస్తుందని అదేవిధంగా కేంద్రంలో ఇండియా కూటమి అత్యధిక మెజార్టీతో గెలిచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిలబెట్టడానికి కృషి చేస్తుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయటానికి నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు అదేవిధంగా ఈ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా పోతుందని ఆయన తెలిపారు
-----------------------
Admin