సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్&బి గెస్ట్ హౌస్ నందు ఆదివాసి సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని దేశ పార్లమెంటులో RTI వేసి 342 ఆర్టికల్ ప్రకారం 1976 లంబాడీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీలుగా గుర్తింపు లేదని పత్రాలను సంపాదించి 2011లో హైకోర్టులో మొదటిసారిగా లంబాడీలపై కేసు నమోదు చేయించిన ఆదివాసి సంక్షేమ పరిషత్, ఉమ్మడి సంఘాలకు మాత్రమే ఉందని అన్నారు.1976 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఎస్సీ,ఎస్టీ ఆడినన్స్ చట్టం ప్రకారం మూడు వర్గాలను ఎస్టీలుగా పేర్కొనబడిన కులాలను బంజారా,సుగాలీలను పరిగణించలేదు.వీళ్ళు అసలైన ఆదివాసులు కాదని వాళ్ళను ఎస్టి జాబితాలో పరిగణించడం వల్ల విద్య, ఉద్యోగం సంక్షేమ పథకాలలో అక్రమంగా లబ్ధి పొందుతున్నారని మండిపడ్డారు. ఆదివాసులకు భిన్నమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు,ఎన్నో హక్కులు చట్టాలు సంక్షేమ పథకాలు కలిగి ఉన్నప్పటికీ కూడా పొందవలసిన గిరిపుత్రులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించే వరకు ఆదివాసి సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, ఆదివాసియువతి, యువకులు కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేపట్టాలని ఆదివాసి అస్తిత్వం కాపాడాలని పెద్ద ఎత్తున ఆదివాసులు కలిసికట్టుగా ఉద్యమం చేయవలసిన సమయం ఆసన్నమైందని ఆదివాసి సమాజానికి పిలుపునిచ్చారు.లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు కృష్ణ బాబు,ఉపాధ్యక్షులు తాటి రాంబాబు,కార్యదర్శి కుర్సం శంకర్,తాటి నాగరాజు, రఘు,రాజ్ కుమార్ సంపత్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin