సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డి పల్లి : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం ఆర్థికప్రణాళిక విద్యుత్ మంత్రివర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క. సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్. మల్లు నందిని విక్రమార్క . మరియు అశ్వరావుపేట శాసనసభ్యులు శ్రీ.జారే ఆదినారాయణ ముఖ్యఅతిథిగా వేంచేసి 27.12.2023 అశ్వరావుపేట నియోజకవర్గం అన్నపురెడ్డిపల్లి మండలం లో కొలువైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దర్శనం నిమిత్తం ఉదయం 10 గంటలకు దర్శనం చేసుకొని అదే విధంగా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి దేవస్థానం దర్శనం చేసుకొని అభిషేక కార్యక్రమాలు చేసి స్వామివారి దర్శనం చేసుకొని 11 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .. మల్లు నందిని మన అన్నపురెడ్డిపల్లి మండలానికి వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మండల అధ్యక్షులను బానోత్ భీముడు వనమా గాంధీ వేముల రమణ పరస వెంకటి దుబ్బాగుల రాము నకరికంటి వెంకటేశ్వరరావు మరియు మండల ప్రజలను కాంగ్రెస్ నాయకులను కలుసుకొని వారి యొక్క సమస్యలను తెలుసుకొని మండలంలోని ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చినారు. అదేవిధంగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజల శ్రేయస్కరణ కోసం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం మీ కష్టసుఖాలను పంచుకుంటాం అని కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరియు మల్లు నందిని హామీ ఇచ్చినారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మండల ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు.....
-----------------------
Admin