సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ మాచరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం చేస్తున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపునకు మనమంతా కృషి చేయాలని మన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించుటకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నాగయ్య, ఎరగాని బిక్షం ,సొసైటీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య, చిమట సైదులు, ఎదగాని గురవయ్య, కొండల్, ఎరగాని సైదులు ,బత్తిని వీరబాబు ,ఎరగని గోపి, అంజయ్య మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
-----------------------
Admin