సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం తుంగారం గ్రామ పంచాయతీ సుంకరంబంజరలో తేజవత్ నరసింహ అతని తల్లి కమలమ్మ గత నాలుగు సంవత్సరాలుగా ఉండటానికి ఇల్లు లేని పరిస్థితి. ఈ క్రమంలో అదే గ్రామంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇంట్లో నివాసం ఉన్నారు, కమలమ్మకి ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఇద్దరు కుతుర్లకి వివాహం జరిగి వెళ్లిపోయారు. గతంలో కమలమ్మకి ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అది కూడా ఉండటానికి ఇల్లు లేని అల్లుడికి ఇచ్చింది. ఆ కారణం చేత గ్రామ సభల్లో ఆరు సార్లు డ్రా తీయడంలో కమలమ్మ పేరు ఉంది. కానీ ఏడవ సారి కమలమ్మ పేరు తీసివేసారు. కారణం ఇందిరమ్మ ఇల్లు వచ్చింది ఆ కారణంతో పెరు తప్పించారు.ఏ దిక్కు లేని కారణంగా ఎలాట్ కానీ డబల్ బెడ్ రూమ్ ఖాళీగా ఉన్న దానిలో నాలుగు సంవత్సరాలు నివాసం ఉంటున్నారు. అనారోగ్యంతో కమలమ్మ గత నెల లో మరణించారు. కొడుకు నరసింహ కర్మ ఖాండల నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లగా కొందరు నరసింహ ఉండే ఇల్లును అక్రమించుకున్నారు. ఏ దిక్కు లేక ఉండటానికి ఇల్లు లేక రోడ్డున పడ్డాడు నరసింహ, ఆపద్బాంధవుడిగా ఉన్న అశ్వారావుపేట యం.ఎల్.ఏ మెచ్చ నాగేశ్వరరావు ని నరసింహ, వారి అక్క వెళ్లి జరిగిన విషయం అంత వివరించగా నీకు నీను ఉన్న ఏమి అధైర్య పడకు, ప్రభుత్వ పథకాలు ఏవి అమలు అయిన మరియు గిరిజన బంధు కూడా నీకు ఖచ్చితంగా వర్తించేలా నీకు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తానంటూ హామీ ఇచ్చారు. నరహీంహ వారి అక్క మెచ్చ నాగేశ్వరరావు కి పాదాభివందనం చేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
-----------------------
Admin