Saturday, 13 June 2026 11:41:02 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

డి పి ఆర్ ఓ రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని...

Date : 30 January 2024 05:32 PM Views : 275

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో వివరించిన ప్రకారం ఈనెల 27న శనివారం రోజు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల పై అవిశ్వాస తీర్మానం సందర్భంగా డిపిఆర్ఓ వ్యవహరించిన తీరు పలు జర్నలిస్టుల ను మనస్థాపానికి గురి చేసే విధంగా ఆయన వ్యవహారం శైలి ఉందన్నారు. ప్రముఖ పత్రికలు, చానళ్లు అంటూ డిఎస్పీకి ప్రొసీడింగ్స్ పంపడంతో పాటు చిన్న పత్రికలు, పెద్ద పత్రికలు, చిన్న చానళ్ళు,పెద్ద చానళ్లు అంటూ విలేకరుల మధ్యన విభేదాలకు డిపిఆర్ఓ కారకుడు అయ్యాడని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. కొందరు విలేకరులను మాత్రమే మున్సిపల్ కార్యాలయంలోనికి అనుమతించి, మిగతా జర్నలిస్టులను అనుమతించకుండా పోలీసులతో అడ్డుకొని అవమానపరిచాడనీ, జోన్ 1 నుండి అక్రమంగా జోన్ 2 లో అర్హత లేకున్నా అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడని, అక్రిడిటేషన్ జారీలో అవకతవకలకు పాల్పడ్డారని, విలేకరుల మనోభావాలను ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కించపరిచేలా ప్రవర్తించారని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి కు ఇచ్చిన వినతిపత్రంలో వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు డాక్టర్ బంటు కృష్ణ, ఐత బోయిన రాంబాబు గౌడ్, పాల్వాయి జానయ్య, బుక్కా రాంబాబు, నాయిని శ్రీనివాసరావు,గన్నోజు జనార్ధన చారి, పల్లె మనీ బాబు, నాగరాజు, సురేష్, ఎరుకల సైదులు గౌడ్, కొండ శ్రీనివాసరావు, మామిడి శంకర్, మామిడి శ్రవణ్, దుర్గం బాలు, పడిశిరి వెంకట్, నజీర్, జహీర్, నందిపాటి సైదులు, వాసా చంద్రశేఖర్, గిరీష్, వెంకట్రావు, రాజు, ప్రవీణ్, రమేష్, వెంకటేష్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :