Thursday, 30 July 2026 08:23:21 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఫిబ్రవరి 16 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి...

Date : 09 February 2024 11:03 AM Views : 374

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని అమరవీరుల భవన్ లో ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు బెల్లంకొండ గురవయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు జడ శ్రీనివాస్ టి ఆర్ ఎస్ కె వి నియోజకవర్గ అధ్యక్షులు పచ్చి పాల ఉపేందర్ ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు మేళ్ల చెరువు ముక్కంటి ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి అవలంబిస్తున్న కార్పొరేట్, మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటన కు పూనుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేండ్లు పూర్తయిన రైతాంగ,కార్మిక సంఘాల ప్రజా సమస్యలను పరిష్కరించ లేదని తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే పోరాడి సాధించిన కార్మిక చట్టాలను కుదించి, నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని, దేశాన్ని మత ప్రాతిపాదికన చీల్చి మూడోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్న బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని అన్నారు.మోస పూరిత నినాదాలు ఇచ్చిన పేదలకు ఏమి ఒరగ లేదని, 2014లో స్వామినాథన్ కమీషన్ సిఫారసుల మేరకు ఎంఎస్ పి మినిమం సపోర్ట్ ప్రైస్ చెల్లిస్తామన్న హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకో లేదన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర, పెట్టుబడుల మీద 50 శాతం ఉండేలా చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని,కార్మికుల హక్కులను కాల రాస్తూ,లేబర్ కోడ్ లు తీసుకొచ్చి, కార్మికుల ను కార్పోరేట్ శక్తులకు బానిసలుగా చేసే విధానాన్ని తీసుకొచ్చిందని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మికులు, ఫిబ్రవరి 16 న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు ఇంది రాల వెంకటేశ్వర్లు,సి ఐ టి యు జిల్లా కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్,ఏ ఐ టీ యూ సీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి ప్రసాద్, టి ఆర్ ఎ స్ కే వి టౌన్ అధ్యక్షులు చింతకాయల మల్లయ్య,సి ఐ టి యు టౌన్ నాయకులు ఇంటి తిరపయ్య, ఐ ఎన్ టి యు సి నాయకులు చింతకాయల రాము తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :