సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : వేంసూరు మండలంలోని మర్లపాడు గ్రామంలో, సత్తుపల్లి లైన్స్ క్లబ్ మరియు జి.వీ.ఎం.ఫౌండేషన్ వారు సంయుక్తంగా మర్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన నేత్ర మరియు కార్డియాలజీ వైద్య శిబిరాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారు వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన గండ్ర సోమిరెడ్డి గారు వారి తల్లిదండ్రులు గండ్ర వీర వెంకటరెడ్డి, మహాలక్ష్మి జ్ఞాపకార్థం జి.వి.ఎం.ఫౌండేషన్ ద్వారా ప్రెజర్ బాక్స్ ని వితరణ చేయగా ,ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేతుల మీదుగా గ్రామ వైకుంఠధామానికి అందజేశారు. దాతృత్వంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న వారిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎసిపి వెంకటేష్, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, సత్తుపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు మందపాటి ప్రభాకర్ రెడ్డి, సెక్రెటరీ దొడ్డ కృష్ణయ్య, ట్రజెరర్ రమేష్, దార కృష్ణారావు, లయన్స్ క్లబ్ సభ్యులు గండ్ర జయ, గండ్ర మాధవ రెడ్డి , జగన్ మోహన్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, లయన్స్ క్లబ్ దుబా శ్రీనివాస రెడ్డి, భిమిరెడ్డి సుధాకర్ రెడ్డి, జక్కం, ప్రసాద్, తోట రమేష్, కొత్తూరు సత్యనారాయణ, సాంబ శివ గుప్త తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin