సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : నల్లచెరువు మండల కేంద్రం లో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రక్కన విజయ్ నెట్ సెంటర్ నందు పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఉచిత ఓటర్ నమోదు కేంద్రం ను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నల్లచెరువు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కేంద్రాన్ని నల్లచెరువు మండల పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్చి 2023 తేదీన జరుగు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి శ్రీ వెన్నపూస రవీంద్రారెడ్డి కి మరియు పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి శ్రీ ఎం.వి రామచంద్ర రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి తోటి వారితో వేయించి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, వైస్ ఎంపీపీ నారాయణస్వామి, సర్పంచ్ లు శ్రీనాథ్ రెడ్డి, యూసఫ్, ఎంపీటీసీ లు భాస్కర్ రెడ్డి, రఫీ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ శంకర్, కో ఆప్షన్ బట్టి హైదరవలి, సింగల్ విండో అధ్యక్షులు జయచంద్ర రెడ్డి, డైరెక్టర్ ఆదిమూర్తి, మాజీ ఎంపీటీసీ రమణ, మాజీ సర్పంచ్ అక్బర్, హరినాథ్ రెడ్డి, శివ శంకర, బావాజీ, హరినాథ్ రెడ్డి, జాషువా నాయక్, రఫీ, హరినాథ్ రెడ్డి, విజయ్ తదితర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin