సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఎం. ఆర్. పి.ఎస్ మండల అధ్యక్షులు దేవపంగు బాబు మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సంద్భంగా మాట్లాడుతూ సెప్టెoబర్ 18,నుండి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్టబద్దత కల్పించాలన్నారు.ఈ దీక్ష కి మాజీ పి ఏ సీ ఎస్ చైర్మన్ దైద రాయేల్ మాదిగ సంఘీభావం ప్రకటించారు.ఈ రిలే నిరాహార దీక్షలకి ముఖ్య అతిథులుగా హుజూర్ నగర్ ఎం ఎస్ పి నియోజక వర్గ ఇంఛార్జి బచ్చలకూరి ప్రసాద్ మాదిగ పాల్గొన్నారు. హాజరై మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వంద రోజులలో ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లును చేస్తానని చెప్పి ,29 సంవత్సరాలు దాటిన, ఇచ్చిన మాటను మరిచి పోయిందని, గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అత్యవసర ఈ పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని అన్న మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలలో దీక్షలు చేపట్టాలని,అదేవిధంగా వర్గీకరణ లేకపోతే విద్యా, ఉద్యోగ అవకాశలలో విద్యార్థులు,నష్టపోతున్నారని, రాజకీ య రంగాలలో మాదిగలు ,మాదిగ ఉప కులాలు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని, గత 29 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం ఎం ఆర్ పి ఎస్ ఆధ్వర్యంలో సామాజికంగా న్యాయమైన ఈ డిమాండును,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మరియు బిఆర్ఎస్ ఎంపీలు, మిత్రపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి , పార్లమెంట్ సమావేశలల ఎస్సీ ఏ బి సి డి వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఎస్పీ అధ్యక్షులు కస్తాల వెంకటేశ్వర్లు మాదిగ,మండల ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి తుళ్లూరి నాగేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పగిడిమర్రి బాబు మాదిగ, చౌటపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాదిగ. గ్రామ శాఖ ఎమ్ఎస్పీ అధ్యక్షులు. గుండె పంగు గోపి మాదిగ. పొట్టేపంగు నవీన్, సత్తారపు రాజేష్.అమరారపు వెంకటయ్య. అమరారపు మట్టయ్య,మాతంగి సా మేల్, చిలకా ప్రవీణ్. యాతవాకిళ్ళ ఎమ్మార్పీస్ గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల పెద్ద సైదులు ఎంఎస్పి గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వర్లు, వి హెచ్ పి ఎస్ మండల నాయకులు కుక్కల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin